ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
posted on Apr 10, 2013 7:33AM
ఐప్ఎల్-6 లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది బంతుల్లోనే పాంటింగ్ 0, సచిన్ 1, రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కి దిగిన దినేష్ కార్తీక్, రోహిత్ శర్మలు వీరవిహారం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 79 బంతుల్లో 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దినేష్ కార్తీక్ 48 బంతుల్లో 86 పరుగులు 14 ఫోర్లు, 2 సిక్సర్లు చేసి మెండిస్ క్యాచ్ పట్టగా మోర్కెల్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ 50 బంతుల్లో 74 పరుగులు 4 ఫోర్లు, 5 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో మిగతా బ్యాట్స్ మెన్ చేసిన పరుగులు పోలార్డ్ 13, అంబటి రాయుడు 24, హర్బజన్ సింగ్ 1 నాటౌట్. 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఈ ఐపిఎల్-6 సీజన్ లో మొదటిసారి 200 పరుగులను దాటింది. ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదటి బంతికే రికీ పాంటింగ్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఉన్ముక్త్ చంద్ వికెట్ ను కోల్పోయింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ లో మూడో వికెట్ కు డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 61 పరుగులు 5 ఫోర్లు, 4 సిక్సర్లు, మన్ ప్రీత్ జునేజా 40 బంతుల్లో 49 పరుగులు 6ఫోర్లు, 82 పరుగులు జోడించారు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేదు. జయవర్థనే 3, జీవన్ మెండీస్ 0, ఇర్ఫాన్ పఠాన్ 10, జాదవ్ 1, నదీమ్ 2. మోర్కెల్ 23 నాటౌట్, నెహ్రా 1, ఉమేశ్ 5 పరుగులతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓజా, పోలార్డ్, జాన్సన్ రెండేసి వికెట్లు తీసుకోగా హర్భజన్ మలింగలకు చెరో వికెట్ దక్కింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.