స్పాట్ ఫిక్సింగ్ క్రికెట‌ర్లపై వేటు

 

స్పాట్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భార‌త్ క్రికెటర్లపై బిసిసిఐ కొర‌డా జులిపించింది. ఐపియ‌ల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన శ్రీశాంత్, అంకిత్ చ‌వాన్‌, అజిత్ చండిలా.అమిత్ సింగ్‌ల‌పై బిసిసిఐ నిషేదం విధించింది.

అయితే తాము ఫిక్సింగ్‌కు పాల్పడ‌టంతో పాటు ఇత‌ర‌ల‌ను ప్రొత్సహించ‌టం అస‌భ్యంగా ప్రవ‌ర్తించ‌టం లాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొటున్న శ్రీశాంత్‌, అంకిత్ చ‌వాన్‌ల‌పై జీవిత‌కాల నిషేదం విధించిన బిసిసిఐ, అమిత్ సింగ్‌ను ఐదేళ్ల పాటు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి నిషేదించింది. అలాగే మ‌రో క్రికెట‌ర్ సిద్దార్ధ త్రివేదిపై ఏడాది నిషేదం విధించింది.

బిసిసిఐకి చెందిన క్రమ‌శిక్షణ క‌మిటీతో పాటు ఇత‌ర క‌మిటీలు ఈ మేర‌కు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.