నీటి సరఫరాపై అంతర్జాతీయ సదస్సు

బేగంపేటలోని హోటల్ గ్రీన్‌పార్క్ వేదికగా నగరాలు, పట్టణాలల్లో నీటి సరఫరాపై అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో సెమినార్‌ జరుగుతుంది. జలమండలి, ఇండియన్‌ వాటర్‌ వర్క్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సెమినార్‌ను సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభిస్తారు. భారత్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన 250మందికి పైగా నిపుణులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు, అధికారులు, వ్యాపారవేత్తలు సదస్సుకు హాజరుకానున్నారు. పదేళ్లకోసారి జరిగిగే ఈ సెమినార్‌ను గతంలో గోవా, చెన్నై నగరాల్లో నిర్వహించారు.