TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

Published on: Tue Apr 24, 2012 11:05AM

ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 58.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,45,694 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,94,758మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.25 కాగా బాలురు 55.95 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.84 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 74 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 43 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ చివరి స్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో విశాఖపట్నం నిలిచింది. వొకేషనల్ ఫలితాల్లో 72 శాతంతో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.