ఒక్క గంటలో రూ.50 వేల కోట్లు

కరోనా వైరస్ ఎన్నో రంగాలపై ప్రభావం చూపించింది. ఎన్నో కంపనీలు డీలా పడ్డాయి. అయితే, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాత్రం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే, ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించింది. 11.5 శాతం వృద్ధితో  4233 కోట్లు నికర లాభాలను సాధించింది. దీంతో గురువారం నాటి మార్కెట్‌ లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా ఇన్ఫోసిస్‌ షేరు రికార్డు లాభాల్లో దూసుకుపోతోంది. సెషన్ ఆరంభంలోనే 15 శాతం పైగా లాభపడి ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్ఫోసిస్ వాటాదారులు కేవలం గంట వ్యవధిలోనే రూ.50 వేల కోట్లకు పైగా దక్కించుకోవడం విశేషం.