పాక్ కు బుద్ది చెప్పడానికి రెడీ..

 

భారత సరిహద్దులో పాకిస్థాన్ తన చర్యలతో పేట్రేగిపోతుంది. పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్విస్తూనే ఉంది. నిన్న అయితే  ముగ్గురు భారత జవాన్లను పొట్టన బెట్టుకోవడంతో పాటు, ఓ జవాను మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ఛిద్రం చేసి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్దమవుతోంది భారత సైన్యం. పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నామని.. పాక్ కు సరైన బుద్ధి చెప్పేందుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. అంతేకాదు 120 ఎంఎం మోర్టార్స్ తో, మెషిన్ గన్స్ తో పాక్ ఆర్మీ పోస్టులపై దాడి చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.