ఉత్తరప్రదేశ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురి మృతి!

 

భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్‌లో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు సైనికోద్యోగులు మరణించారు. ఇది భారతదేశం రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్). ఈ హెలికాప్టర్ బరేలీ నుంచి అలహాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గడచిన మూడేళ్ళలో ఈ తరహా హెలికాప్టర్ ప్రమాదాలు పదకొండు జరిగాయి. శుక్రవారం జరిగిన ప్రమాదంలో వాంగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ కూడా వున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బారైలీ నుంచి అలహాబాద్‌కు బయల్దేరిన హెలికాప్టర్ లక్నోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి కూలిపోయింది.