లార్డ్స్ లో ధోనిసేన ధమాకా
posted on Jul 22, 2014 9:22AM
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 28ఏళ్ళ తరువాత భారత్ జట్టు టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో స్టులో 95 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. భారత పేసర్ ఇషాంత్ శర్మఅత్యుత్తమ గణంకాలు నమోదు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ ఇశాంత్ దెబ్బకు 223 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో రూట్(66), ఆలీ(39),కుక్(22),బ్యాలెన్స్ (27) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇశాంత్తోపాటు జడేజా, సామీ చెరో విటెక్ పడగొట్టారు.దీంతో 28 ఏళ్ల తరువాత లార్డ్సలో టెస్ట్ మ్యాచ్ ను గెలిచిన భారత జట్టుగా ధోనీ సేన చరిత్రను తిరగరాసింది.