కోహ్లీ డబుల్ సెంచరీకి కారణం అదేనట...


ప్రస్తుతం టీమిండియాకు.. వెస్టిండీస్ కు మధ్య సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో కోహ్లీ రెచ్చిపోయి డబుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇప్పుడు తాను డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డానికి గ‌ల కార‌ణం ఏంటో చెబుతున్నాడు. గతంలో ఇక్కడ మూడు సిరీస్లో పాల్గొన్నప్పుడు కేవలం 76 పరుగులు మాత్రేమే చేశాను.. అప్పుడు ‘వెస్టిండీస్ లో రాణించలేనని నాపై విమర్శలు వచ్చాయి. అప్పుడు నేను నిరాశలోకి వెళ్లాను. నా అభిమానులు కూడా నేనిక్కడ రాణించాలని కోరుకుంటున్నారు.. ఆ ఒత్తిడితోనే తాను అద్భుతమ‌యిన ఇన్నింగ్స్ ఆడాన‌ని.. చివ‌రికి అది సాధ్యమైందని అన్నాడు. ఇప్పుడు ఒకేసారి డబుల్ సెంచరీ చేశాన‌ని, ఈ సిరీస్ తనకెప్పుడూ ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని చెప్పాడు.