టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజీలాండ్‌తో ముంబైలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవలీ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి మంచి జోరుమీదున్న భారత్ తిరుగులేని ఫామ్‌లో ఉంది. మరోవైపు టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ఇది 200వ వన్డే..

భారత జట్టు
శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, కేదార్‌ జాదవ్‌, ధోనీ, హర్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, యజ్వేంద్ర చాహల్‌


కివీస్‌ జట్టు
మార్టిన్‌ గుప్తిల్‌, కాలిన్‌ మున్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోలస్‌, కాలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, ఆడమ్‌ మిల్నే, టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌