ఇంగ్లాండ్ 255 ఆలౌట్..
posted on Nov 19, 2016 1:19PM
భారత్-ఇంగ్లడ్ జట్ల మధ్య విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 455 పరుగలకు ఆలౌట్ అయ్యి భారీ లక్ష్యాన్నే ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ముందునుండి తడబాటుగానే ఆట ప్రారంభించింది. 103/5 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు లంచ్ విరామానికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 110పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. లంచ్ తర్వాత కూడా స్టోక్స్, రషీద్ క్రీజులో నిలదొక్కుకున్నా ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 35 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 255పరుగులు మాత్రమే చేసింది. భారత్కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, షమి, ఉమేశ్ యాదవ్, జడేజా, జయంత్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.