టీమిండియా తొలి రోజు స్కోర్... 317/4

 

భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో తొలి రోజు ముగిసింది. విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా మారింది. తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పొయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. అయితే క్రీజులో నిలదొక్కుకున్నపుజారా, కోహ్లీ మాత్రం సెంచరీలు చేసి మంచి స్కోరునే అందించారు. వీరిద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా తొలిరోజు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ తరువాత (119) పరుగుల వద్ద పుజారా తన వికెట్ ను కోల్పోగా.. ఆతరువాత బ్యాటింగ్ కు దిగిన అజింక్యా రహనే కూడా 23 పరుగులకే ఔటయ్యాడు.  దీంతో విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్ (1) జతకలిశాడు. దీంతో ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 317 పరుగులు చేసింది.