భారత్ తడ'బ్యాటు'.. మ్యాచ్ డౌట్..!!

 

భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే.. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచ్ ఈరోజు మొదలైంది.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. అయితే బ్యాటింగ్ కి దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మురళీ విజయ్, ఆండర్సన్ వేసిన అద్భుత బంతికి డకౌట్‌గా వెనుదిరిగాడు.. అదేవిధంగా ఏడో ఓవర్లో ఆండర్సన్, ఓపెనర్ రాహుల్‌(8)ను కూడా పెవిలియన్ పంపి భారత్ ను దెబ్బకొట్టాడు.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, పుజారా క్రీజ్ లో ఉన్నారు.. అయితే రెండోరోజు కూడా వర్షం మ్యాచ్ కి అడ్డంకిగా మారింది.. మ్యాచ్ నిలిపివేసే సమయానికి 6.3 ఓవర్లకు భారత్ స్కోరు 11/2.. క్రీజ్ లో ఉన్న కోహ్లీ, పుజారా ఇన్నింగ్స్ నిలబెడతారేమో చూడాలి.