TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరకాల ప్రత్యర్థిపై భారత్ గెలుపు

Published on: Wed Mar 13, 2013 11:33AM

మలేషియా లో జరుగుతున్న అజ్లాన్ షా మెన్స్ హాకీ టోర్నమెంట్ లో భారత్ తన చిరకాల ప్రత్యతి పాకిస్తాన్ పై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. రెండు పరాజయాలను ఎదుర్కొన్న భారతజట్టు ఈ విజయంతో టోర్నీలో కొనసాగే అవకాశాలను నిలుపుకుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో భారతజట్టు ఆటగాళ్ళు చక్కటి సంయమనంతో ఆడింది. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిముషంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ వకాస్ గోల్ చేయడంతో ఖంగుతిన్న భారతజట్టు ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో మరు నిముషంలోనే భారత ఆటగాడు రూపీందర్ సింగ్ గోల్ చేయడంతో స్కోరు సమానమయింది. భారత్ తొమ్మిదో నిముషంలో ఆకాశ్ దీప్ రెండో గోల్.  56వ నిముషంలో మన్దీప్ సింగ్ మూడో గోల్ చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎంత ప్రయత్నించినా భారత గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో గోల్ సాధించడంలో విఫలమయ్యారు.