ఇండియా మ్యాచ్ డౌటేనా?

 

 

 

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ 20 సెమీ ఫైనల్ లెక్క ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుంచి ప్రారంభం కావలసి వుంది. ఇండియా – దక్షిణాఫ్రియా జట్ల మధ్య బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియంలో జరుగుతుంది. గురువారం నాడు వెస్టిండీస్ – శ్రీలంక మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ వర్షం కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. వర్షం పెరిగిపోయి మ్యాచ్ ఆగిపోవడం వల్ల తలాతోకా లేని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కారణంగా వెస్టిండీస్ మ్యాచ్ ఓడిపోయింది. అలాంటి పరిస్థితి ఇండియా ఆడే మ్యాచ్‌కి కూడా వస్తుందేమోనని క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు.

 

ఇప్పటికే ఢాకా స్టేడియం దగ్గర వర్షం వచ్చేదా వద్దా అన్నట్టుగా మబ్బులు కమ్మి వున్నాయి. మ్యాచ్‌కి ముందే గనుక వర్షం పడి మ్యాచ్ రద్దయితే రన్ రేట్ ఆధారంగా ఇండియా ఫైనల్‌కి చేరుకుంటుంది. అయితే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం పడితే మాత్రం ఇండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతికి బలైపోయే ప్రమాదం వుందని ఇండియా క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు.