ప్రతిష్టాత్మక 500 టెస్ట్ మ్యాచ్.. భారత్ విజయం..


ప్రతిష్టాత్మక 500 టెస్ట మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 197 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. కాన్పూర్లోని గ్రీన్ పార్కులో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 87.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మైదానంలో కోహ్లీ సేన సంబరాలు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. కాగా, ఇండియా ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్ లో 88వ విజయం కాగా, న్యూజిలాండ్ పై 19వ విజయం.

 

కాగా మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 318 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 262 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్సింగ్స్ లో భారత్ 377 పరుగులు సాధించగా.. మొదటి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓటమి పాలైంది. దీంతో 192 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.