న్యూజిలాండ్ కు కష్టతరంగా మారిన టెస్ట్ మ్యాచ్...


భారత్ న్యూజిలాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన 500 వ టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 377/5 వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. అయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు కనీసం డ్రా అయినా చేసి గట్టేక్కాలని చూస్తుంది. అయితే దానికి కూడా బ్రేకులు వేసింది టీమిండియా. 120 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 80 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ గా నిలిచిన రోంచీని పెవీలియన్ దారి పట్టించారు. జడేజా విసిరిన బంతిని సరిగ్గా ఆడలేని రాంచీ దానిని గాల్లోకి పంపగా.. అశ్విన్ దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 5వ వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 60 ఓవర్లలో 170 పరుగులు కాగా, ఆ జట్టు చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 264 పరుగులు చేయాల్సి వుంది.