లంచ్ టైం.. బారత్ స్కోర్ 247/2
posted on Dec 10, 2016 11:32AM
ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక ఈరోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 247పరుగులు చేసింది. తొలిరోజు ఆట ప్రారంభించిన వెంటనే పుజారా ఔటయ్యాడు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ దూకుడుగా ఆట ఆడుతుండటంతో జట్టు ఇప్పటివరకూ బాగానే స్కోర్ చేసింది. ఈ రోజు ఆటలో 31ఓవర్లు ఆడిన భారత జట్టు వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు లంచ్ విరామ సమయానికి మొత్తం 83ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం మురళీ విజయ్ 124 పరుగులతో, విరాట్ కోహ్లీ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.