'నిర్భయ' చట్టం అమలు

 

 

india court Nirbhaya rape trial, India court ban on Nirbhaya

 

 

దేశంలో తొలిసారిగా 'నిర్భయ' చట్టం మన రాష్ట్రంలో అమలైంది. అత్యాచార కేసులో మెదక్ జిల్లా, సంగారెడ్డి కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2011మే నెలలో పటాన్‌చెరు మండలం ఐలాపూర్‌ తండాకు చెందిన ఎస్సీ బాలికపై బీహార్‌కు చెందిన పింటూ యాదవ్‌ అత్యాచారం చేశాడు. కేసు విచారించిన సంగారెడ్డి కోర్టు అతడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో 10 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ప్రస్తుతం నిందితుడు యాదవ్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఇటీవల పార్లమెంటులో నిర్భయ చట్టాన్ని సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. చట్టం ఆమోదం పొందిన తర్వాత సంగారెడ్డి కోర్టు నిర్భయ చట్టం ఆధారంగా దేశంలోనే తొలిసారి తీర్పు చెప్పింది.