క‌రోనా కేసుల్లో మూడో స్థానానికి భార‌త్

భారత్‌ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో 24,248 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,97,413 కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 19,693కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 4,24,433 మంది కోలుకోగా.. ప్రస్తుతం 2,53,287 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, క‌రోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న ర‌ష్యాను వెన‌క్కి నెట్టి.. భార‌త్ మూడో స్థానానికి చేరుకుంది.