ఆసీస్ దూకుడు..లంచ్ టైం 131/1

 

ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య ఈరోజు చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఒపెనర్ రెన్ షాను ఉమేష్ యాదవ్ ఆరంభంలోనే అవుట్ చేసి టీమిండియాకు శుభారంభం ఇచ్చాడు. అయితే ఆ తరువాత టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌లు భార‌త్ బౌల‌ర్ల‌ను ర‌ఫాడిస్తున్నారు. భోజ‌న విరామ స‌మ‌యానికి ఆస్ట్రేలియా వికెట్ న‌ష్టానికి 131 ర‌న్స్ చేసింది. వార్న‌ర్ 54, స్మిత్ 72 ర‌న్స్‌తో  అర్ధ సెంచరీలు చేసి టీమ్ కు మంచి స్కోరే అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నారు.