ఐసిసి టేస్ట్ ర్యాంకింగ్స్ లొ భారత్ కు మూడవస్థానం
posted on Mar 26, 2013 3:09PM
భారత్ క్రికెట్ జట్టు టేస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లొ మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డే కి సౌత్ ఆఫ్రికా 128 పాయింట్లతో మొదటిస్థానాన్ని నిలుపుకుని 450,000 యు.ఎస్. డాలర్లు సొంతం చేసుకుంది. న్యూజిల్యాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డ్రా చేసుకుంది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం అయివుంటే భారత్ కు రెండో స్థానం దక్కించుకుని 350,000 యు.ఎస్. డాలర్లు అందుకునేది. ఇంగ్లాండ్ డ్రా చేసుకోవడంతో ఇంగ్లాండ్ కు రెండో స్థానం భారత్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియాకి 250,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి. అలాగే నాలుగవ ర్యాంక్ పొందిన ఆస్ట్రేలియా జట్టుకు 150,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి.