ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై ‘సుప్రీం’లో ఇంప్లీడ్‌

 

ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ అవుతామని తెలిపారు. ఆగస్టు 4న తీర్పు అనుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్‌ కొనసాగిస్తామని, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిమీద ఆగస్టు 5న సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వెలిబుచ్చుతున్నా ఉన్నత విద్యామండలి ముందుకే వెళ్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 7 నుంచి కౌన్సిలింగ్ జరుపుతామంటూ బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.