బిజెపికి నో..కాంగ్రెస్ లోనే: పనబాక

 

 

 

కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని..పార్టీని ఎప్పటికి వీడనని చెప్పారు. బాపట్ల నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి ఎస్సీ,ఎస్టీ నిధులు మంజూరుకావడం లేదని, నిధులు కోరితే ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులపై పనబాక అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తనకు సహకరించడం లేదని, వారి సహకారం ఉంటే బాపట్ల నియోజవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని పనబాక లక్ష్మి అన్నారు.