చెరువుల అన్యాక్రాంతంపై హైడ్రా కీలక సమావేశం
Published on: Fri Nov 22, 2024 9:48AM
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కీలక సమావేశం శుక్రవారం (నవంబర్ 22)న జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్ టి ఎల్ పరిధిపై చర్చంచనున్నారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా చేపట్టే చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పొలూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, రిటైర్డ్ ఈ ఎన్సీ, ఇరిగేషన్ సీఈవోలు కూడా ఈ సమావేశంలో భాగస్వాములౌతున్నారు.


