‘తీవ్రవాద’ విద్యార్థుల అరెస్ట్... విడుదల...

 

ఇరాక్‌కి చెందిన ఓ ఉగ్రవాద సంస్థ ‘ఆశయాలు’ తెలుసుకుని హైదరాబాద్‌కి చెందిన నలుగురు విద్యార్థులు ఎంతో ఆకర్షితులయ్యారు. వెంటనే ఆ సంస్థలో చేరిపోవాలని ఇరాక్‌కి ప్రయాణం కట్టారు. అయితే ఈ నలుగురూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొరికిపోయారు. పోలీసులు ఆ విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏదో ఆవేశంలో అలా తీవ్రవాదం వైపు ఆ నలుగురూ ఆకర్షితులు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్‌లో ఆ సంస్థ గురించి ఈ విద్యార్థులు తెలుసుకున్నారని చెప్పారు. ఆ నలుగురు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.