కేసీఆర్ పరిశీలనలో భూగర్భ మెట్రో రైలు

 

మెట్రోరైలు అలైన్‌మెంట్ కారణంగా హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ ప్రాంతంలో చారిత్రక కట్టడాలను కోల్పోతున్నామని టీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోంది. మెట్రో రైలు ఎలైన్‌మెంట్‌ని మార్చాలని టీఆర్ఎస్ గతంలో ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెట్రోరైలు పనులను కేసీఆర్ ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి , ఎల్ అండ్ టీ ప్రతినిధులు శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు డిజైన్ మార్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సుల్తాన్ బజార్ ప్రాంతంలో మెట్రో రైలు మార్గాన్ని భూ గర్భంలోనుంచి వేసే ఎలా వుంటుందన్న ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైలు అధికారుల ముందు వుంచినట్టు తెలుస్తోంది.