TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ లో కలకలం... లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్

Published on: Fri Sep 11, 2015 3:46PM

 

హైదరాబాద్ లో ఓ మహిళా తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన ఖాకీలు...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ చెక్కేస్తున్న లేడీ టెర్రరిస్ట్ నిక్కీ జోసెఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ దేశస్తురాలైన నిక్కీ జోసెఫ్... గతేడాది అరెస్టయిన ఉగ్రవాది మొయినుద్దీన్ కి ప్రియురాలని, ఈమెకు ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కూడా ఉన్నాయని, పలువురు యువకులను ఐసిస్ లో చేర్చేందుకు ప్రయత్నించిందని పోలీసులు వెల్లడించారు. ప్రియుడు మొయినుద్దీన్ తో కలిసి ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి...ఐసిస్ కోసం పనిచేసిందంటున్న పోలీసులు...పక్కా సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. నిక్కీ జోసెఫ్ ను దుబాయ్ నుంచి హైదరాబాద్ కి రప్పించడంలో తాము పన్నిన వ్యూహం వర్కవుట్ అయ్యిందంటున్న ఖాకీలు...నగరంలో ఆమెకున్న పరిచయాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఐసిస్ లో చేరేందుకు వెళ్తూ...ఇప్పటివరకూ 30మంది అరెస్ట్ అయ్యారని, వాళ్లకూ నిక్కీకి ఏమైనా సంబంధాలున్నాయా? వీళ్లలో ఎవరికైనా ఎర వేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఓ లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్ అవ్వడం మాత్రం కలకలం రేగుతోంది. ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో మాత్రమే కనిపించే లేడీ టెర్రరిస్టులు... మన భాగ్యనగరంలో ఉన్నారని తెలుసుకుని ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు.