TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు గోపాలరావు కన్నుమూత

Published on: Fri Apr 24, 2026 5:42PM

 

హైదరాబాద్ పుస్తక రంగా నికి విశిష్ట సేవలందించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధప డుతూ కొండాపూర్ లోని తన కుమారుడి నివాసంలో  ఏప్రిల్ 23న తుదిశ్వాస విడిచారు. గోపాలరావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ స్థాపకుల్లో ముఖ్య పాత్ర పోషించారు. తొలి పుస్తక ప్రదర్శన నిర్వహణలో సమన్వ యకర్తగా వ్యవహరించి, నగరంలో పుస్తక సంస్కృతి ని విస్తరించడంలో కీలక పాత్ర వహించారు. అలాగే తన సైంటిఫిక్ సర్వీసెస్ సంస్థ ద్వారా పుస్తక రంగానికి అనేక సేవలు అందించారు. 

పుస్తక ప్రదర్శనల నిర్వహణలో ఆయన చేసిన కృషి పుస్తకాభిమానులు, ప్రచురణకర్తలు ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా నిలిచింది. ఆయన భౌతిక దేహాన్ని ఏప్రిల్ 26 ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని స్వగృహంలో మిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గోపాలరావు మరణంపై హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డా. కవి యాకూబ్, కార్యదర్శి ఆర్. వాసు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పుస్తక రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మర ణీయమని పేర్కొన్నారు. పుస్తక సంస్కృతిని ప్రజల్లో విస్తరించేందుకు జీవితాన్ని అంకితం చేసిన గోపాలరావు మరణం పుస్తక ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది.