ఇంకా అధికారంలోనే బంజారాహిల్స్..

నిన్న కురిసిన భారీ వర్ష బీభత్సం నుంచి భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు. గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి దెబ్బకు ఎక్కడి చెట్లు అక్కడే కూలిపోయాయి. కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విరిగిపడ్డ చెట్లను, కొమ్మలను తొలగించడంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది తమ శక్తి కొలది తొలగిస్తున్నా ఇంకా చాలా చోట్ల చెట్లు అలాగే ఉండిపోయాయి. అవి తీస్తే గాని విద్యుత్ శాఖ సిబ్బందికి కరెంటు పునరుద్దరించడం సాధ్యంకాదు. గాలివాన దెబ్బ బలంగా పడిన బంజారాహిల్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.