దంపతుల మధ్య ఫోన్ వివాదం.. భార్యని చంపిన భర్త...

 

ఫోన్ ఆమె ప్రాణం తీసింది. కేవలం ఫోన్లో మాట్లాడ్డమే ఆమె నిండు జీవితానికి ముగింపు పలికింది. బెంగుళూరుకు చెందిన రేణుక, సైమన్ అనే యువతి యువకులు ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకున్నారు. సైమన్ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో కూడా చేరాడు. సంసారం హాయిగా సాగిపోతోంది. అయితే రేణుకకి గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతూ వుండటం అలవాటు. భర్త ఇంట్లో వున్నా ఫోన్ మాట్లాడ్డంలోనే మునిగిపోయి వుంటుంది. ఈ విషయంలో సైమన్ ఆమెను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ రేణుక తన ధోరణి మార్చుకోలేదు. సైమన్ ఆఫీసు నుంచి ఎప్పుడు ఇంటికి పోన్ చేసినా ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చేది. ఈ విషయంలో గత నెల నుంచి దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం రాత్రి దంపతులు తీవ్రంగా గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన సైమన్ కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.