బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన విపక్షాలు

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అనంతరం వాకౌట్ చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించిన నిర్మలా సీతారామన్ వారు వాకౌట్ చేసినా పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

 - 7.7 కోట్ల మందికి ప్రయోజనం కలిగే విధంగా కిసాన్ కార్డుల పరిమితిని  3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 

- అలాగే ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేశారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను రూ. 5 నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

- స్టార్టప్ లకు రుణాల పరిమితిని పది కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. 

- ఇది కాకుండా బొమ్మల తయారీకి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu