బియాస్ నది దుర్ఘటన: మృతదేహాలన్నీ లభ్యం!

 

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీకి చెందిన విద్యార్థులందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం నాడు కల్లూరి శ్రీహర్ష అనే విద్యార్థి మృతదేహం నదిలో లభ్యం కావడంతో ఈ ప్రమాదంలో చనిపోయిన విద్యార్థుల మృతదేహాలన్నీ లభించినట్టు అధికారులు ప్రకటించారు. కాగా ఆదివారం నాడు గాలింపు చర్యల సందర్భంగా రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలు కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన దాసరి శ్రీనిధి, హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన రిషితారెడ్డివిగా అధికారులు గుర్తించారు. కాగా సోమవారం నాడు గాలింపుల సందర్భంగా కల్లూరి శ్రీహర్ష మ‌తదేహం కూడా లభించినట్టు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన 42 రోజులకు మృతదేహాల అన్వేషణ పూర్తయింది.