బస్సు లోయలో పడి 17 మంది మృతి

 

 

 

హిమాచల్ప్రదేశ్ సిమౌర్ జిల్లాలోని మైలా గ్రామంలో బస్సు లోయలో పడటంతో 17 మంది ప్రయాణికులు మరణించారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని షిల్లై ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించింది.