హిమాచల్‌‌ ఎన్నికల రణరంగంలోకి బీజేపీ

హిమాచల్‌ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో విజయమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారి జాబితాను బీజేపీ సిద్దం చేసి ఇవాళ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లు ఉన్నాయి. నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 68 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే బీజేపీ విడుదల చేసింది.