విజ్ఞానజ్యోతి కాలేజీకి హిమాచల్ హైకోర్టు నోటీసు

 

 

 

హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఇంకా తెలుగు ప్రజల కళ్ళముందు కదులుతూనే వున్నారు. ప్రమాదం జరిగిన పదిరోజులు దాటినా ఇంతవరకూ గల్లంతయిన చాలామంది ఆచూకీ తెలియకపోవడం బాధాకరం. ఇదిలా వుండగా నదిలో గల్లంతు అయిన విద్యార్థులు నదిలోకి దిగడానికి అనుమతి ఎవరు ఇచ్చారో తెలపాలంటూ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యానికి హిమాచల్ హైకోర్టు శుక్రవారం నోటీలసు జారీ చేసింది. మరోవైపు ఈ దుర్ఘటనపై మండి డివిజన్ కమిషన్ నివేదికను హిమాచల్ హైకోర్టుకు అందజేసింది. డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ఆ ప్రమాదానికి ఘటనకు కారణమని డివిజన్ కమిషన్ ఆ నివేదికలో పేర్కొంది.