హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సిందే..

 


అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఇది మరింత ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఓర్లాండాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ హిల్లరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె చేసిన తప్పిదాలకు హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ ల్యాప్ టాప్ నుంచి పంపిన 65,000 ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని ఎఫ్ బీఐ తన దర్యాప్తులో కనుగొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. స్వీయ తప్పిదాలకు హిల్లరీ ఒక్కరే ఇందులో బాధితురాలు కాదని, అమెరికన్ ప్రభుత్వ తీరుతో ప్రజలందరూ ఈమెయిల్స్ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కోరుకునే వాళ్లు తన వెంట ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు.