TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వల్లభనేని వంశీ ఎన్నికపై హైకోర్టు విచారణ

Published on: Tue Nov 1, 2022 1:55PM

కృష్ణాజిల్లా గన్నవారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. వకాలత్ దాఖలు చేశామని కౌంటర్ వేలయడానికి సమయం కావాలని ఎమ్మెల్యే తరఫు న్యాయ వాది కోరారు. పిటిషన్లో ప్రతివాదులు పలువురికి మరోసారి నోటీసులు జారీ చేసింది. మరికొం దరికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు ఇచ్చేందుకు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయడానికి పిటిష నర్‌ తరఫు లాయర్‌కు అనుమతిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన యార్ల గడ్డ వెంకటరావు 2019 జులైలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వంశీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రచారంలో వంశీ సూచనతో తహసీల్దార్‌ సంతకంతో ఇళ్ల స్థలాల నకిలీ పట్టాలు పంపిణీ లెక్కింపు ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరగడం తో స్వల్ప తేడాతో ఓడిపోయానని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. 

2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంశీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి వంశీ గెలుపొందాడని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ యార్లగడ్డ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాపుల‌పాడులో ఎమ్మార్వో స్టాంపు ఫోర్జరీ చేసి.. 12 వేల న‌కిలీ ఇళ్ల ప‌ట్టాల‌ను తన అనుచరులకు వంశీ పంచారని యార్లగడ్డ వెంక ట్రావు పిటి షన్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేసిన‌ట్లు వల్లభనేని వంశీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.