డాక్టర్ సుధాకర్ కేసు సంచలన మలుపు.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి, నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. కానీ, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు కోర్టు తెలిపింది.