హైకోర్టుకే అబద్దం చెప్పిన ఏపీ డీజీపీ, హోమ్ సెక్రెటరీ.. 27న స్వయంగా హాజరు కావాలని ఆదేశం 

ఒక పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు (సోమవారం) స్వయంగా హైకోర్టుకు హాజరు కావాలని డీజీపీ, హోమ్ సెక్రటరీలను ఏపీ హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఈరోజు కోర్టు విచారణకు హాజరు కాకుండా ముఖ్య అధికారులు ఇద్దరు సాక్షాత్తు హైకోర్టుకు అబద్దాలు చెప్పారు. "ప్రస్తుతం తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని అందుకే విచారణకు స్వయంగా హాజరు కాలేకపోతున్నామని" వారు హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు అన్నీ వాయిదా వేయాలని ఏపీ సీఎస్ కోరారని... కానీ తమరేమో ఎన్నికల విధులంటున్నారు ఇది ఎలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 27న కోర్టుకు తప్పకుండా హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.