జగన్ సర్కార్ కి ఊహించని దెబ్బ.. మళ్లీ ఎన్నికల కమిషనర్గా రానున్న నిమ్మగడ్డ!
posted on May 29, 2020 12:02PM
జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.