శ్వేతా బసు ప్రసాద్... పునరావాస కేంద్రంలో హ్యాపీ...

 

ప్రముఖ సినిమా కథానాయిక శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించింది. హీరోయిన్ హోదా అనుభవించి, ఏదో ఒక మార్గం ద్వారా బోలెడంత డబ్బు సంపాదిస్తూ వున్న శ్వేతా బసు ప్రసాద్ అకస్మాత్తుగా ఇలా పోలీసులకు పట్టుబడటం, ప్రభుత్వ పునరావాస కేంద్రానికి వెళ్ళాల్సి రావడం... ఇలాంటి పరిస్థితుల్లో మామూలుగా అయితే ఎవరైనా భోరున ఏడుస్తూ వుంటారు. దిగులుగా కూర్చుని వుంటారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పునరావాస కేంద్రంలో వున్న శ్వేతా బసు ప్రసాద్ ఎంతమాత్రం దిగులు పడకుండా చాలా మామూలుగా, అసలేం జరగనట్టుగా, అందర్నీ హ్యాపీగా పలకరిస్తూ వున్నట్టు సమాచారం. పోన్లెండి... తలరాత ఎలా వున్నా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే గుండె ధైర్యం కూడా వుంది. మొత్తానికి శ్వేతా బసు ప్రసాద్ గట్టి పిండమే.