వాగులో కొట్టుకుపోయిన ఆటో... కడప జిల్లాలో ఆరుగురు గల్లంతు

రాయలసీమలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు దగ్గర వాగులో ఆరుగురు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వాగు పొంగి పొర్లడంతో ఆ వరద ప్రవాహంలో ఆటో కొట్టుకుపోయింది. దాంతో ఆ ఆటోలో ప్రయాణిస్తోన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వాగులో కొట్టుకుపోయారు. దాంతో గల్లంతైనవారి కోసం వాగులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.