విజయవాడలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. అయితే, విజయవాడ జీజీహెచ్‌ లో వ్యాక్సిన్ వేయించుకున్న రాధ అనే హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే రాధ కళ్లు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సాధారణంగా ఉన్నట్టు సమాచారం. వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే కళ్లు తిరిగినట్టు అనిపించిందని రాధ తెలిపారు. వెంటనే డాక్టర్లు పరీక్షించారని, ప్రస్తుతం కొద్దిగా చలిగా ఉన్నా.. ఇబ్బందేమీలేదని రాధ చెప్పారు.