మోహన్ బాబు కేసు: పద్మశ్రీ తొలగించాలని కోర్టు ఆదేశం

 

 

 

సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం ‘పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టైటిళ్లలో వారి పేర్ల ముందు ‘పద్మశ్రీ' వేసుకున్నారన్న వివాదానికి సంబంధించి, హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తాజా విచారణ అనంతరం, ‘దేనికైనారెడీ’ సినిమా టైటిల్స్‌ నుంచి మోహన్‌బాబు, బ్రహ్మానందం పేర్ల ముందున్న పద్మశ్రీని తొలగించాలని ఆదేశించింది. టైటిల్స్‌లోని ‘పద్మశ్రీ’ పేరు వాడకంపై అఫిడవిట్‌ సమర్పించాలంటూ బ్రహ్మానందంకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సినిమా టైటిల్స్‌ నుంచి పద్మశ్రీ తొలగించి, ఆ విషయాన్ని పత్రికల్లో ప్రకటన వచ్చేలా చేయాలనీ చిత్ర నిర్మాతలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.