కిడ్నాపర్ల చెరనుంచి యశోదా డాక్టర్ కి విముక్తి
Published on: Fri Sep 7, 2012 12:50PM
యశోదా హాస్పిటల్ డాక్టర్ హర్షారెడ్డిని పోలీసులు కిడ్నాపర్ల చెరనుంచి బైటపడేశారు. కృష్ణాజిల్లా నూజివీడులో ఉన్న కిడ్నాపర్ల డెన్ ని పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. హర్షారెడ్డి ఉన్నట్టుండి మాయమవడంపై చాలా అనుమానాలు రేకెత్తాయి. చివరికి ఆస్తికోసం బంధువులెవరైనా కిడ్నాప్ చేసుంటారా అన్న కోణంలో విచారణ జరిపినప్పుడు పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. పక్కా ఆధారాలతో చాకచక్యంగా కిడ్నాపర్ల డెన్ మీద దాడిచేసిన పోలీసులు హర్షారెడ్డిని రక్షించారు.


