సీఎం బెదిరింపులకు దడవను: హరీష్

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కిరణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ..బెదిరింపులకు ఎవరూ లొంగరు. ఆయన భయపెడితే భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. తెలంగాణ రైతులకు బోర్ల కొరకు 19 వేల కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ ఇచ్చానని ముఖ్యమంత్రి అసేంబ్లీలో చెబుతున్నాడు. కానీ ఆ బోర్లు వేసేందుకు, వాటి మోటార్లకు తెలంగాణ రైతులు 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీష్ రావు సూచించారు. సీమాంధ్రకు నీరు కాలువల ద్వారా వెళ్తుంటే ..తెలంగాణ రైతులు స్వంత డబ్బుతో బోర్లు తవ్వుకుంటున్నారు. దానికి ఉచిత విద్యుత్ పేరుతో రాత్రివేళ ..ఇష్టం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో తెలంగాణ రైతులు విద్యుత్ షాక్ లతో, పాము, తేలు కాట్లకు గురయి మరణిస్తున్నారు. సీమాంధ్రలో నీటి సరఫరా ఖర్చు ప్రభుత్వం భరిస్తే, తెలంగాణలో ఖర్చు రైతు భరిస్తున్నాడని హరీష్ రావు తెలిపారు.