యూటి అంటే నాలుక‌లు కోస్తాం

 

హైద‌రాబాద్‌ను యూనియ‌న్ టెరిట‌రీ చేయాల‌న్న చిరంజీవి వ్యాఖ్యల‌పై టిఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ఫైర‌య్యారు. అలా మాట్లాడిన వారి నాలుక‌ల‌ను కోస్తామ‌ని హెచ్చరించారు. సికింద్రాబాద్ గాందీ ఆస్పత్రిలొ తెలంగాణ మెడిక‌ల్ జేఏసి ఏర్పాటు చేసిన శాంతి దీక్ష కార్యక్రమానికి హాజ‌రైన హ‌రీష్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

హైద‌రాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల‌న్న చిరంజీవి మ‌తి ఉండే మాట్లాడుతున్నారా అని ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌ను యూటి చేయ‌డం ద్వారా అది ఇరు ప్రాంతాల‌కు కాకుండా పోతుంద‌ని, అస‌లు యూనియ‌న్ టెరిట‌రీ చేయ‌డం వ‌ల్ల ఎవ‌రికి లాభం క‌లుగుతుందో చెప్పాల‌న్నారు. ఈవిష‌యం పై దానం నాగేంద్రర్‌, ముఖేష్ గౌడ్‌లు మాట్లాడాల‌ని అన్నారు.

హైద‌రాబాద్‌లో ఉన్న సీమాంద్ర నాయ‌కులు త‌మ కోట్ల ఆస్తుల‌ను కాపాడుకోవ‌టానికే కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాద‌న తెర‌మీద‌కు తీసుకు వ‌స్తున్నార‌ని అన్నారు. హైద‌రాబాద్ గురించి మాట్లాడే క‌న్నా సీమాంద్రలో రాజ‌ధాని నిర్మాణం గురించి ఆలోచించాల‌న్నారు.