నిమ్మకూరు నుంచి హ‌రికృష్ణ యాత్ర

 

స‌మైక్యాంద్రకు మ‌ద్దతుగా రాజీనామ చేసిన టిడిపి ఎంపి హరికృష్ణ బ‌స్సుయాత్ర చేప‌ట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్దాప‌కుడు త‌న తండ్రి నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన నిమ్మకూరు నుంచు ఈ యాత్ర ప్రారంభించ‌నున్నారు. ప్రస్థుతం డిల్లీలో ఉన్న ఆయ‌న హైద‌రాబాద్ రాగానే ఏ రోజు నుంచి యాత్ర మొద‌ల‌వుతుంది అన్న అంశం పై ప్రక‌ట‌న చేయ‌నున్నారు.

హ‌రికృష్ణ రాజీనామ త‌రువాత ఆయ‌న‌తో చ‌ర్చించిన టిడిపి ఎంపిలు ప్రస్థుతానికి ఎలాంటి యాత్రలు చేప‌ట్ట వ‌ద్దని చెప్పినా ఆయ‌న మాత్రం త‌న ఆలోచ‌న మార్చుకోలేదు. దీంతో ఆయ‌న పార్టీ కి దూర‌మ‌వుతున్నార‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరిన‌ట్టయింది. దీనికి తోడు హరికృష్ణ వేరే పార్టీలో చేరే ఆలోచ‌నలో ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తుంది.