హరికృష్ణకు టిడిపి షాక్..!

 

 

 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ పార్టీ రాజకీయాల్లో దెబ్బ తిన్నారు. హరికృష్ణ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, అయితే అదే సమయంలో టిడిపి లోక్‌సభ సభ్యులు నలుగురు రాజీనామా చేసినట్టు ప్రకటించి హడావుడి చేసినా, స్పీకర్ వద్దకు ఒకే ఒక రాజీనామా లేఖ వెళ్లింది. ఇక రాజ్యసభ సభ్యుల్లో హరికృష్ణ ఒక్కరిదే ఆమోదం పొందింది. టిడిపి ఎంపీల్లో ఒక్కరి లేఖ మాత్రమే వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం వెల్లడించడంతో టిడిపి ఎంపిలు ఇరకాటంలో పడ్డారు. వారి రాజీనామాల వ్యవహారం డ్రామా అని ఇతర పార్టీల వాళ్లు విమర్శించారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు హరికృష్ణ మళ్లీ యాత్ర ఊసెత్తడం లేదు. రాజీనామా తరువాత ఆయన ఉనికిని పార్టీ నాయకులెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.